Tuesday, October 5, 2010

               మేము ఉండే మా ఇల్లు ఒక పది ఇళ్ళున్నకాంపౌండ్ . అందులో మా ప్రక్కన కరణం గారూ , వారి ప్రక్కన ఒక వకిలు గారూ,అ ప్రక్కన ఇంట్లో ఒక  పాలిటెక్నిక్   కాలేజి లెక్చరరు , (వాళ్ళ ఇంట్లో, ఆయన తండ్రిగారు బంగారం పని చెస్తూ ఉండే వారు. )  ఆ ప్రక్కన సహకార శాఖ లో పని చేసే ఒక శెట్టి గారూ ఉండేవాళ్ళు.


    మరో వరస ఇళ్లన్నీ అక్కడికి దగ్గర లోనే ఉన్న పల్లెలో వ్యవసాయం ఉన్న కామండులకి సంబంధించి దాదాపు ఐదు ఇళ్లు ఉండేవి. . వాళ్ళ ఇళ్ళల్లోనే రెవిన్యూ శాకః లో పని చేసే సుబ్బా రావు గారు అద్దె కుండే వారు. ఆయన ఆ ఇంట్లో కి రావడమే మాకు ఎంతొ సహాయమయింది. అలాగని శాఖా పరమైన సహాయం ఆయన దగ్గర మాకు    ఎప్పుదూ  అవసరం రాలేదు
.
    ఆయన ఇంటి ముందు మాత్రం బిళ్ళ బంట్రోతు ఎప్పుదూ ఉండే వాడు.
     ఎప్పుడు   చూసినా ఎక్కువగా టూరు లోనే   ఉండేవారాయన
.
             మా పెరట్లోమందార నందివర్ధనం, కనకాంబరం, మల్లె, బంతి, చిట్టి చేమంతి, మొదలైన పువ్వుల మొక్కలు,  నిమ్మ,దబ్బ  ,కొబ్బరి , జామ ,పనస,అల్లనేరేడు,దానిమ్మ, మామిడి మొదలైన చెట్లు అన్ని ఉండేవి. ప్రొద్దుటే లేస్తే మొక్కలకి నీళ్ళు పోయడం, పాదులుచేయడం లాంటి పనులలో అమ్మకి సాయపడటం మాకు ఒక పని.    దొడ్లోకి రాగానే ఎదురుకుండా తహసిల్దరుగారు వారి  హంగులు,  ,ఆర్భాటాలు  కనిపించేవి.వాళ్ళింట్లో నే ఆయన బావమరిది, సహకార శాఖలో పనిచేస్తూ ఒకదగ్గరే  కలిసే ఉండేవారు.
 పరోపకారం అన్న దానికి మారుపేరు ఆయన. ఇది ఇలా ఉంటె నా వరకు వస్తే           
         ఉద్యోగం లో చేరడం అనేది నెనెప్పుడూ  ఆలోచించలేదు.అసలు విశ్లేషించుకుంటే నన్ను నేను ఏవిషయం లో కూడా ఒక గోలు పెట్టుకుని ,ఏదో కష్ట పడి దాన్ని సాధించానని చెప్పడానికి  ఏమి లేదు. రోజులు గడుస్తున్నై, వాటితో బాటే అవకాశాలూ వచాయి. గుంపులో గోవింద లాగ అన్దరూ ఏమి చేస్తే ,మనం కూడా వారి తో కలిసిపోయి అదే పని చేయడమే.
 మనసులో యిదేలాగా, అదెలాగ అని ఎన్నో ప్రశ్నలు వచెవెఇ. కాని వాటికి  ఓపికగా సమాదానాలిచే తిరిక పెద్దవాళ్ళకి లేదు,
అలాగని మనం అడిగేసామా అంటే అంత సిను అస్సలు లేదు.
కల్లెర్రజుసి చూసే పెద్దవాళ్ళని ప్రశ్నించే దమ్ము నాకు ఆ రోజుల్లో లేదు.
కానీ కో కొల్లలుగా వస్తున్నా ప్రశ్నల్ని నాలో నేనే ప్రశించుకుని, చాలాకాలం వరకు ఒక ప్రశ్న గానే మిగిలి పోయన్నేను.
ఎందుకని అడిగినా, విమర్శించినా నాదగ్గర సమాధానం లేదు. నేను 10th exams వ్రాసాక ఇంటరు లో జేరే ప్రహసనం తమాషాగా ఉండింది. అది తర్వాత చెప్తా.  


                                               *     *       *      *     *    *     *
         సరిగ్గా ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడే వ్రాసా ననుకుంటా. ఏమ్ప్లయిమేంట్ ఆఫీసు కి వెళ్లి 10th   పూర్తి కాగానేఏమ్ప్లోయి మెంటు కార్డు అప్పట్లో ఒకఅవసరం గా భావించే వాళ్ళు.అందరిలాగే నేను కూడా కార్డు తిసుకున్నా. అందులో సితమ్మగారని మాకు , మా కుటుం బానికి తెలిసిన ఆవిడ పని చేస్తూ ఉండేవారు. వెళ్ళగానే  procedure అంతా చెప్పి వెంటనే కార్డు చేతికి ఇచ్చి పoపించారావిడ . ఆ క్షణం లో ఏదో సాధించేసినట్లు ఒక ఫీలింగు . అప్పట్లో దాన్ని క్రమం తప్పకుండా రెన్యువల్ చేయించుకోవాలి . అల్లాగే చేసేవాళ్ళం. దాంతో బాటే టైపు నేర్చుకోవడం కూడా ఒకటి . నేను, మా చిన్నక్క,పెద్దక్క ప్రతినిత్యము టైపు కి వెళ్ళేవాళ్ళం.
         
              దీంతో బాటే ఇక్కడ చెప్పాలిసిన ముఖ్యులు కి.శే. వేణుగోపాల రావు గారు. ఆయన్ని గురించి చెప్పకపోతే నా తెలివితేటలకి అహంకారాన్ని జత చేసినదాన్నవుతాను. నా యీ జీవితం స్వార్జితం తో, ఎవరిమీదా ఆధారపడకుండా సాగుతోందంటే ఇదంతా
వేణుగోపాల రావు గారు మాకు పెట్టిన విద్యా దానం వల్లనే అనడం ఎంత మాత్రం సందేహం లేదు. బొటాబొటీ సంపాదనతో మా కుటుంబంలో దాదాపు పది మందిని పోషించవలసిన బాధ్యత మా నాన్నగారిది. అలాంటప్పుడు   ఇంతమందికి ఖర్చు  పెట్టి చదువు చెప్పించాలంటే అయే పని కాదు. అలాంటి టైము లోనేవేణుగోపాల రావు గారు మాకు పరిచయ మయ్యారు.

         మేముండే కాంపౌండ్ లోనే వాళ్ళు కూడా అద్దెకుండే వాళ్ళు. లలిత కళలన్నా, పిల్లల కార్యక్రమాలన్న ఆయనకి చాలా ఇష్టం. అప్పుడే మా కంపౌండు లో నవజీవన బాలానంద సంఘం అన్నదాన్నొక దాన్ని నా స్నేహితుడు, కిషన్ వాళ్ళు ఏర్పాటు చేస్తే దానికి   వేణుగోపాల రావు గారు సలహాలు, కార్యక్రమాల నిర్వహణ కి మాట సాయము చేస్తుండేవారు. నేను   10th  చదువుతూ చిన్న, చిన్నగా గేయాలు, నాటకాలు, పాటలు వ్రాస్తుండే  దాన్ని. ఈ సందర్భం లో నేను స్వార్ధం అన్న ఒక నాటిక రాసి, కిషన్ మా ఇంటికి వస్తే చూపించాను. అది చూసి కిషన్ ,దీన్ని నవంబెర్ లో మన బాలల కార్యక్రమాల్లో వేద్దామని చెప్పి ఆ పనికుపక్రమించాడు. 
  
    అప్పుడే వేణుగోపాల రావు గారు యమలోకంలో కరప్షన్ అన్న ఒక నాటకం వ్రాసి పిల్లలన్దరితోను కలిసి ఆ నాటకాన్ని వేయించాడు. దాన్లో ప్రదీప్, ఆనంద్(ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్లో పని చేస్తున్నాడు),విద్యాసాగర్,మధు మొదలైనవాళ్ళు పాత్రలు పోషించారు. అద్భుతమైన ఆ నాటకాన్ని ఎప్ప్పటికి మర్చిపోలేము. దాని తర్వాతే చాలాకాలానికి ఎన్.టి రామారావు గారూ నటించిన యమ దొంగ సినిమా వచ్చింది.   ఇప్పుడు ఆ  కిషను లేదు, వేణుగోపాల రావు గారు లేరు. మిగతావాళ్ళంతా ఎక్కడెక్కడో ఉన్నారు. కొంతమంది అపుడప్పుడు పలకరిస్తూ ఉంటె కొంత మంది ఎక్కడున్నారో తెలిదు. గుండేరావు మమయ్యగారి ఇంటి అరుగు మీద మా నాటకాల ప్రదర్శన జరుగుతూ ఉండేది. ఆ వేదిక మాకిచ్చినందుకు మా బాలానంద సంఘం  తరఫున ఆయనకీ మేము గౌరవం గా ఏదో బిరుదు బ్బహుష కళా కిరీటి అనో మరేదో  కూడా మా సంఘం తరఫున ఇచ్చినట్లు జ్ఞాపకం.
  


    





No comments: