Sunday, October 3, 2010

ఆది గురువు

             మా ఇంట్లో మా అమ్మ గారు మాకు ఆది గురువు  .మా పిల్లలన్దరికీ దాదాపు  మూడో తరగతి దాకా ఆవిడే పాఠాలు, పెద్ద బాల శిక్ష మొదలు ఎక్కాలు, గుణింతాలు , A,B,C,D లు నాలుగు రకాలు దాదాపుగా మొత్తం పుస్తక జ్ఞానం అమ్మే నేర్పించింది. మా వీధిలో అందరు రాజ్యలక్ష్మి కన్యా పాథశాల లో చదువుకున్నామని అంటూ ఉండే వాళ్ళు. మా నాన్న నన్ను తీసికెళ్ళి బేసిక్ స్కూలు లో సీతమ్మ టీచర్ కి అప్పచెప్పి మధ్యాన్నం వచ్చి ఫార్మాలిటీస్    అడ్మిషన్  కి సంబంధించి పూర్తి  చేస్తానని చెప్పి వెళ్లారు. ఆ రోజు ఆయన మధ్యాన్నం వీలు కుదరక  మధ్యాన్నం  ఇంటికి వెళ్ళాక నాతొ   నిన్న కూర్చున్న క్లాస్ లోనే  కూర్చో , నేను ఇవ్వాళ వస్తా నన్నారు. ఆ రోజు మధ్యాన్నం ఆయన వచ్చేటప్పటికి నేను మూడో క్లాస్ లో కూచుని, ఏడుస్తున్నాను. నాన్న రెండో క్లాసు లో కూచోమంటే,  సితమ్మ టీచరు నన్ను   మూడో తరగతి లో కూర్చో పెట్టింది. నాన్న తంతారేమో  అని నా ఏడుపు అన్నమాట. 
            నాన్న వచ్చి నన్ను వెతికి, నా క్లాసు లో నన్నుచుసి అప్పుడే రెండవ క్లాసు  నుంచి నేను కూర్చున్న  మూడవ క్లాసు లోకి అడుగు పెడుతున్న సీతమ్మ టీచర్ తో మాట్లాడు తున్నారు. ఆవిడ ఏం చెబుతుందో అని భయం. ఇంతలో ఆవిడ చెప్పిన మాటలు నాకనందం కలిగించాయి .   ఆవిడ నాన్నతో మీ అమ్మాయి నాకే పాఠాలు చెప్పేట్టు   ఉంది. తనకి రెండవ తరగతి అక్కర్లేదు, మూడవ తరగతి లోనే    అడ్మిషన్   చేద్దాం. అన్నారు. ఆవిడ ఆ స్కూల్ కి అప్పుడు ఆవిడ  ప్రైమరీ పాథశాల కి ప్రధానోపాధ్యాయు రాలు అని గుర్తు. 
         ఇంకేముంది, మనం మూడో క్లాస్ కి వచ్చాం నాన్న ఇంట్లో అమ్మతో ఈ విషయం చెబుతుంటే నాకెంతో గర్వం అనిపించింది. 
       అలాగని నేనేమి జీనియస్    కాదండోయ్ . అదంతా అమ్మ చదువు చెప్పిన  చలవ.  మాత్రు    దేవో భవ.(అమ్మ ఉన్నప్పుడు ఆవిడకి నేను ఎప్పుడు నా మనసులో భావాలు చెప్పుకో  లేక పోయాను.ఇప్పుడు చెప్పాలంటే ఆవిడ లేరు. )
       

1 comment:

రహ్మానుద్దీన్ షేక్ said...

మీ అమ్మే కాదు
మా అమ్మ కూడా అంతే
ఆమె వలెనే నేను ఇవాళ తెలుగు ఇంత బాగా చాడువుతానూ, రాస్తానూనూ
మాతృదేవోభవ