Saturday, April 10, 2010

సాగే జీవన రాగం


చాలా రోజులతర్వాత నాబ్లాగు లో ఏదైనా రాద్దామని కూర్చున్నాను.
ఎండలు మండి  పోతున్నై అంటే   అందరు నవ్వుతారు. ఇదెమీ చెప్పాల్సిన విషయం కాదె అనుకుంటారు కూడా  
       కర్ఫ్యూ  వల్ల జనాలు ఎంత బాధ పడుతున్నారో అంటే కర్ఫ్యూ పెట్టడమే (సామాన్యజనాన్ని)    బాధ పెట్టడానికే కదా దాన్లో ప్రత్యేకించి అనుకోడానికి ఏముంది అంటారేమో
 కానీ నేనేదైనా చెప్పాలి.
       అన్నట్టు గర్భిణీ స్త్రీలని కానుపుకు కూడా అనుమతి ఇవ్వనంత తప్పు వాళ్ళేమి చేసారో, ఈ మగాళ్ళకి నొప్పులోచ్చి ఆ నొప్పలతో  ఒక్కడంటే ఒక్కడు బాధ పడ్డా కర్ఫ్యూకాదు దానమ్మ ఉన్నాఆ ఆడమనిషిని ఆసుపత్రిలో జేర్చడానికి అ పోలిసోల్లె సహాయమందించే    వాల్లేమో  .
         మళ్ళి సాయపడ్డ వాళల్లోకూడా మీడియా పొటీ . మాచానేల్ గొప్ప చూసారా, ప్రసవ వేదన పడుతుంటే ముందుండి  హాస్పిటల్ కి
పంపించాం . మేమెంత ముందున్నామో  చూసారా ? తాము చేసామని 
 చెప్పుకున్టూనె  , అవతల వాళ్ళు ఏం చేయలేదో, తామెంత గొప్పో హయిగా చెప్పుకుంటూ,మా చానెల్ చేసిన పని మీకు నచ్చిందా . మీకు  నచ్చితే ----అని టైపు చేసి స్పేస్ ఇచ్చి గొప్ప మీ చానేలే అని వ్రాసి గోవిందా గోవిందా అన్న సెల్ నెంబర్ కి మెసేజ్ చేయండి --మర్చిపోకండి ----ఇలా సాగిపోతోంది ఒక చానెల్ గోల.


    ఆ మహతీ... ప్రముఖ బొంగారాలాడే తార మానియా పెళ్ళంట కదా . వాళ్ళింటి ముందు  ఇప్పుడు ఎంతమంది జనాలున్నారు,
హడావుడి ఎలా ఉంది  వివరాలు చెప్పండి ...తూఊఊఊఊఊఊఉఇ  హలో.....హలో    మహతి  నామాటలు వినిపిస్తున్నాయా

      ఇంతలో అవతల్నిచి హలో బాబీ నేనిప్పుడు,  ఇప్పుడేంటి ఇవ్వాళ ఉదయం నిన్చీబొంగారాలాడే తార మానియా ఇంటిముందే ఉన్నాను వాళ్ళింట్లో అందరు హాయిగా తిని, తాగి డాన్స్ చెస్తూ సంతోషంగానే ఉన్నారు. మన మీడియా వాళ్ళు తప్ప అందఋ  హాయిగా  , వాళ్ళ వాళ్ళఇళ్ళల్లో నిద్రపోతున్నారు, అంతే  కాదు, పరిక్షల  కారణం గా వాళ్ళ వాళ్ళ పిల్లని చదివిన్చుకున్తూ జనాలందరూ కూడా వాళ్ళ, వాళ్ళ ఇళ్ళల్లో   
ప్రశాంతంగా ఉన్నారు.దరిద్రం అంటుకున్నట్లు , మన మీడియా వాళ్ళు మాత్రమె బొంగారాలాడే తార మానియాఇంటిముందు పడిగాపులు గాస్తున్నారు. ఇప్పుడు సమయం రాత్రి సుమారు పన్నెండు గంటలయింది, ఇప్పుడు మానియా ,వాళ్ళ అమ్మగారు కలిసి ఎటో వెళ్తున్నారు, మా పరిశోధనలో మన క్లూస్  టీమ్ చెప్పిన వివరాల ప్రకారము వాళ్ళు రెస్ట్ రూం కి వెళ్తున్నట్లు తెలిసింది,     
ఇంతలో స్టూడియో నించి న్యూస్ రీడరు ఆ.. మహతీ, ఇప్పుడే వాళ్ళ పెరటి దోవ నుంచి మన ఛానల్ కి ఎక్స్  క్లుసివ్   గా  వార్త లం దిం చ టానికి  మన మురళి లైన్ లో ఉన్నారు మరి ఆ వార్త లేంటో చూద్దం  లైన్ కట్   ఇలా సాగుతూ ఉంటుంది ఎక్స్  క్లుసివ్ వార్తలని అందించే తపన. ఇది ఎవరికీ ఏ రకంగా ఉపయోగమో ఆ చానల్ వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఈ బాధలన్నీ పడలేక దేవుడు ముందు చూపుతొ రాయి అయి పోయాడు గనక.
     మన మేమైపోతామో, ముందు, ముందు పిచాసుపత్రులకి ఎంత గిరాకీ వస్తుందో చేప్పక్కరలేదనుకుంటా. ఇది సాగే జిఇవన రా   ఆఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ గం  
ఇలాంటి పొగడ్తలు , స్వోత్కార్షలు వింటున్నా, చూస్తున్నానాకో కధ జ్ఞాపకం వస్తుంది. మహా భారతం లో   అభిమన్యుణ్ణి ప్రత్యర్ధులు   పద్మవ్యూహం లో సంహరించినప్పుడు , తానూ లేని  సమయం లో, తనకుమారుణ్నిఒంటరిని చేసిప్రత్యర్ధులు చంపుతుంటే , ఇంతమంది పెద్దనాన్నలు, చిన్నాన్నలు ఉండి కూడా తన తనకుమారుణ్నికాపాడ లేక పోయిందుకు నిందించిన అర్జునుడు ఆవేశం తగ్గినాక తన తప్పు తెలుసుకునిపశ్చాత్తాపంతో  , కృష్ణా , వాసుదేవా 
 ఆవేశంలో పెద్దంతరం, చిన్నంతరం మర్చిపోయి , పుత్ర శోకం తో నా అగ్రజులను, తమ్ములను అనరాని మాటలన్నాను , నా యీ తప్పుకి ఏదైనాప్రాయచిత్తం    సెలవియ్యమని వేడుకున్నాడు. దానికి సమాధానం గా వాసుదేవుడు ఈ విధంగా తరుణోపాయం చెప్పాడు. 
    అర్జునా , చెబుతాను, విను. ఎవరైనా వాక్చాతుర్యం ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్లి, నిన్ను అలసిపోయే దాకా పోగిడించుకో  . ఆ పొగడ్త లే నీకు ప్రాయచిత్తం. అని సెల విస్తాడు. 
          మరి మన చానల్స్ కి మనల్ని ఇంత బాధ పెడుతున్నందుకు  ప్రాయచిత్తమే లేదా,  అయినాపశ్చాత్తాప పడ్డ  వాళ్ళకే కదా ప్రాయచిత్తం......................................

No comments: